సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్, దర్శక నిర్మాత కరణ్ జోహార్ మేనేజర్కు ముంబై పోలీసులు సమన్లు జారీ చేసినట్టు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ ప్రకటించారు. మొదట మహేష్ భట్ను, ఆ తరవాత కరణ్ జోహార్ మేనేజర్ను ప్రశ్నించనున్నట్టు అనిల్ వెల్లడించారు. అయితే, ఈ సమన్లపై నటి కంగనా రనౌత్ తన టీమ్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. ముంబై పోలీసులపై విమర్శలు గుప్పించారు. “ఆఖరికి సమన్లు జారీ చేయడంలోనూ ముంబై పోలీసులు నిర్లక్ష్యంగా సిగ్గులేని నెపోటిజంను ప్రదర్శించడమేంటి? కంగానాకే సమన్లు ఇచ్చారు.. ఆమె మేనేజర్కు కాదు. కానీ, ముఖ్యమంత్రి కొడుక్కి బెస్ట్ ఫ్రెండ్ మేనేజర్ని విచారణకు పిలిచారు, ఎందుకని?” అని తన టీమ్ ట్విట్టర్ ఖాతా ద్వారా కంగనా ప్రశ్నించారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణాన్ని హత్యగా అభివర్ణించిన కంగనా రనౌత్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేకు ప్రాణ స్నేహితుడు కావడం వల్ల కరణ్ జోహార్కు సమన్లు జారీ చేయలేదని.. ఆయన మేనేజర్కు సమన్లు ఇచ్చారని కంగన ఆరోపించారు. గత కొద్ది రోజులుగా సినిమా ఇండస్ట్రీలోని కొంత మంది ప్రముఖులకు వ్యతిరేకంగా కంగన పలు ఆరోపణలు చేశారు. దీనిపై ఇప్పటికీ సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది.
previous post