సురేందర్రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేశారు. తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి ఆదరణ దక్కుతుంది. అలాగే ఓవర్సీస్లోనూ సైరా చిత్రానికి మంచి ఆదరణ దక్కుతుంది. వివరాల ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ లో 2.5 మిలియన్ డాలర్స్ను రాబట్టుకుంది. చిరంజీవి చిత్రాల్లో 2.5 మిలియన్ డాలర్స్ వసూళ్లను సాధించిన చిత్రమిదే. అలాగే సినిమాల్లోకి రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి నటించిన 150వ చిత్రం `ఖైదీ నంబర్ 150`… 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి` చిత్రాలు ఓసర్సీస్లో రెండు మిలియన్ డాలర్స్ను రాబట్టుకున్నాయి.
previous post