బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులోని ట్విస్టులు సస్పెన్సు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. తాజాగా సుశాంత్ మాజీ మేనేజర్ శృతి మోదీని కూడా ఈడీ విచారించింది. తాజాగా రెండోసారి ఈడీ విచారణకు శ్రుతీ మోదీ హాజరైంది. ఈ సందర్భంగా సుశాంత్, రియా బంధానికి సంబంధించి శృతి కీలక విషయాలు వెల్లడించిందట. “సుశాంత్ అంగీకరించే ప్రాజెక్టులతోపాటు, ఆయన ఆర్థిక వ్యవహారాల్లోనూ రియానే కీలకంగా వ్యవహరించేది. బిజినెస్కు సంబంధించి సుశాంత్కు వచ్చే ఫోన్ కాల్స్కు కూడా రియానే సమాధానం చెప్పేది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నేను సుశాంత్తో టచ్లో లేను” అని శృతి చెప్పినట్టు సమాచారం. రియా, సుశాంత్ డేటింగ్లో ఉన్న సమయంలో శృతి మేనేజర్గా పని చేసింది. కాగా సుశాంత్ అకౌంట్ నుంచి దాదాపు రూ.15 కోట్లు తన అకౌంట్కు రియా ట్రాన్స్ఫర్ చేయించుకుందని పేర్కొంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రియాపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా రియాను ఈడీ ఇప్పటికే రెండుసార్లు విచారించింది.
previous post