telugu navyamedia
Uncategorized

అక్కడ శంఖం ఊదితే కరోనా మాయం: బీజేపీ ఎంపీ సలహా

Sukhbir Singh Corona BJP

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఇస్తున్న సలహాలు హాస్యస్పదమవుతున్నాయి. ఆవు పంచకంతో కరోనా నయమవుతుందని, అప్పడాలు తింటే కరోనా దరిచేరదని పలువురు బీజేపీ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అప్పడాలు తింటే నయమవుతుందని కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. అనంతరం ఆయన కూడా కరోనా బారినపడ్డారు.

తాజాగా రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ సుఖ్ బీర్ సింగ్ జౌనపురియా కూడా తనవంతుగా ఓ సలహా విసిరారు. బురదలో కూర్చుని శంఖం ఊదితే కరోనా వ్యాధి నయమవుతుందని తెలిపారు. బురదలో కూర్చుని శంఖం ఊదితే ఇమ్యూనిటీ పెరుగుతుందని, తద్వారా కరోనాపై పోరాడే శక్తి వస్తుందని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంపీ జౌనపురియా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related posts