telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కలిసి జీవించినా.. విడిగా జీవించినా.. ఏపీకే చెల్లింది..: ఎస్‌ఆర్‌ఎస్‌ సర్వే

srs survey on couple in india

భార్యాభర్తల బంధంపై దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో అది ఏపీ లో భార్యాభర్తలు కలిసి జీవించే వారితో పాటుగా విడిగా జీవించేవారు ఎక్కువేనట. ఇదే జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో ఉంధి. అత్యధికంగా దంపతులున్న ఏపీలో భర్త లేదా భార్య లేనివారు… లేదా వారికి దూరంగా ఉంటున్న వారు కూడా అధికమే. ఇటువంటి ఆసక్తికర విషయాలను శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే (ఎస్‌ఆర్‌ఎస్‌) విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే…జీవిత భాగస్వామి లేకుండా, లేదా ఒంటరిగా జీవిస్తున్న వారు ఇండియా మొత్తంలో 3.7 శాతం మంది ఉండగా, ఏపీలో 5.1 శాతం మంది, టీఎస్ లో 4.7 శాతం మంది ఉన్నారు. దేశం మొత్తం జనాభాలో 46.8 శాతం మంది వివాహితులు ఉన్నారు. ఏపీలో 54 శాతం మంది వివాహితులు ఉండగా, ఆపై, కేరళలో 51.5 శాతం, తమిళనాడులో 51.2 శాతం, పశ్చిమ బెంగాల్‌ లో 51.1శాతం ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల లెక్కల్లోకి వస్తే, ఏపీలో 52.5 శాతం మంది వివాహిత పురుషులు, 55.6 శాతం వివాహిత మహిళలు ఉన్నారు. తెలంగాణలో 48.1 శాతం మంది వివాహిత పురుషులు, 52.1 శాతం మంది వివాహిత మహిళలు ఉన్నారు. దేశంలోనే అతి తక్కువగా బిహార్‌ లో 41.2 శాతం పురుషులకు మాత్రమే పెళ్లిళ్లు అయ్యాయి. ఇదే సమయంలో జీవిత భాగస్వామికి దూరమైన వారు దేశం మొత్తంలో 3.7 శాతం మందికాగా, ఏపీలో 5.1 శాతం మంది (పురుషుల్లో 2.4 శాతం, మహిళల్లో 7.9 శాతం) ఉన్నారు. ఇదే విషయంలో తెలంగాణలో 4.7 శాతం మంది (పురుషుల్లో 2 శాతం, మహిళల్లో 7.6 శాతం) ఉన్నారు. జీవిత భాగస్వామిని కోల్పోయి లేదా ఎడబాటుకు గురైన వారిలో మహిళలే ఎక్కువగా ఉండటం గమనార్హం.

Related posts