telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దుర్మార్గపు ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు: శ్రీకాంత్ రెడ్డి

srikanthreddy ycp

కరోనా పెరిగిపోవాలనే దుర్మార్గపు ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో కూర్చున్న చంద్రబాబుకు టైంపాస్ కాకపోవడంతో ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని అన్నారు.

లేఖలు రాయడంలో రికార్డు సాధించాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. లేఖలు రాయడం కాదు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పథకాలు అమలు చేశారో చూసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. కష్టకాలంలో కూడా తాను ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని ప్రశంసించారు.

Related posts