telugu navyamedia
క్రీడలు వార్తలు

మా కెప్టెన్ ధోనినే : సిఎస్కే సీఈఓ

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టు. ఆడిన 10 సీజన్ లలో ప్లే ఆఫ్ కి చేరిన చెన్నై జట్టు ఈ సీజన్ లో మాత్రం అంతగా రాణించలేకపోయింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ లలో కేవలం 4 మాత్రమే గెలిచి ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్ నుండి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది. అయితే చెన్నై జట్టు వైఫల్యాలకు ఆ జట్టు కెప్టెన్ ధోనినే కారణమని… కొని మ్యాచ్ లలో అతను తీసుకున్న నిర్ణయాల కారణాంగే ఆ జట్టు ఓడిపోయింది అని మాజీలు విమర్శించారు. ఫామ్ లో లేని కొంత మంది ఆటగాళ్లకు చాలా మ్యాచ్ లలో ధోని అవకాశాలు ఇచ్చాడని.. అందువల్లే వారు ఓడిపోయారని అన్నారు.

దాంతో ఆ జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లను వచ్చే ఏడాది జట్టు నుండి తీసేస్తారని… ధోనిని కూడా కెప్టెన్ గా తప్పిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం పై స్పందించిన సిఎస్కే సీఈఓ విశ్వనాథన్… ఒక్క ఏడాది విఫలమైనంత మాత్రాన ధోనిని  మేము వదిలేస్తామా… 2021 లో కూడా ధోనీనే మా కెప్టెన్. అతను చెన్నై జట్టుకు మూడు టైటిల్స్ అందించాడు. అంతేకాకుండా ఐపీఎల్ లో ఏ జట్టు కూడా ఇప్పటివరకు ప్రతి సీజన్ లో ప్లే ఆఫ్ లోకి వచ్చింది లేదు . కానీ ఈ సీజన్ లో మాత్రం చెన్నై జట్టు ప్లే ఆఫ్ కి రాలేదు. జట్టు నుండి రైనా, హర్భజన్ తప్పుకోవడం తర్వాత ఆటగాళ్లకు కరోనా సోకడం జట్టులో సమతుల్యాన్ని దెబ్బ తీశాయి. అలాగే కొన్ని గెలవాల్సిన మ్యాచ్ లను ఓడిపోయాము. అందుకే ఈ పరిస్థితి వచ్చింది అన్నాడు.

Related posts