టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం దారుణమని అన్నారు.సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న కార్మికులకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
ఆర్టీసీ కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయవద్దని అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని, అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిపోల వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులకు పూర్తి సంఫీుభావం తెలిపారు.
పార్టీ పిరాయింపులపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు