telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

కొన్ని మీడియా సంస్థలకు కనీస ఇంగితజ్ఞానం లేదు: కేటీఆర్

KTR Counter pawan comments
ప్రధానమంత్రి కావాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారంటూ ఓ ఇంగ్లిష్ దిన పత్రిక ప్రచురించిన వార్త పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకోకుండా, కామన్‌సెన్స్‌లేకుండా, వార్తలు ప్రచురిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేసీఆర్ మూడు యాగాలు చేయిస్తున్నారంటూ సీఎన్ఎన్ న్యూస్ 18 ఓ వార్తను ప్రచురించగా.. దాన్ని చూసిన ఓ నెటిజన్, కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ  స్పందించాలని కోరాడు. ఆపై కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, “కొన్ని వార్తా సంస్థలు కనీస ఇంగితజ్ఞానం కూడా లేకుండా, నిజానిజాలను పరిశీలించకుండా వార్తలను ప్రచురిస్తుంటాయి. ఇటువంటి వార్తలను పబ్లిష్ చేయడాన్ని సంబంధిత ఎడిటర్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Related posts