అందం, అభినయం ఉన్న నటీమణుల్లో ముందు వరుసలో ఉండే హీరోయిన్ శ్రీయ శరణ్. సౌత్ ఇండియన్ తెరపై దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రేక్షకుల మనసు దోచుకుంటూ అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత కెరీర్కి కాస్త గ్యాప్ ఇచ్చింది. కొన్ని రోజుల పాటు భర్త ఆండ్రీ కోస్చీవ్తో షికార్లు కొడుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేసిన శ్రీయ రీసెంట్గా తిరిగి కెమెరా ముందుకొచ్చింది. మ్యారేజ్ విరామం తర్వాత ఆమె చేసిన లేటెస్ట్ మూవీ ‘గమనం’. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… అప్పట్లో ఒక డాన్స్ వీడియోలో తనను చూసిన తెలుగు ఫిల్మ్ మేకర్స్ “ఇష్టం” సినిమా కోసం తీసుకున్నారు. ఆ తర్వాతా వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఇక నాగార్జునతో కలిసి సంతోషం సినిమా చేసే టైంలో నా వయసు చాలా తక్కువ. అప్పటి జ్ఞాపకాలను నేను ఎప్పటికి మర్చిపోలేను. నాగార్జున గారితో నటించడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆయనతో ఇప్పటి వరకు పలు సినిమాల్లో నటించినా కూడా మరిన్ని సినిమాల్లో నటించాలని కోరకుంటున్నాను. నాగార్జునతో కలిసి నటించడానికి నేను ఎప్పుడు సిద్దమే” అని శ్రియ చెప్పుకొచ్చింది. నాగ్ తో కలిసి చివరిగా ఈ భామ ‘మనం’ సినిమాలో నటించింది.
previous post
చిరు అబద్ధం చెప్పారు… చరణ్ నిజం చెప్పారు : ఉయ్యాలవాడ వారసులు