telugu navyamedia
సినిమా వార్తలు

రామాయణంలో సీతగా శ్రద్ధా కపూర్ ?

Shraddha

మ‌న సంస్కృతికి అద్దం ప‌ట్టే ఇతిహాసాల్లో రామాయ‌ణంకు ఎంతో ప్రాముఖ్యమైంది. అయితే ఇప్పటికే రామాయణాన్ని వెండి తెరపై, బుల్లితెరపై ప్రదర్శించారు మన దర్శకనిర్మాతలు. తాజాగా “రామాయ‌ణం”ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌డానికి నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రా సిద్ధ‌మ‌య్యారు. 1500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని 3డీ టెక్నాల‌జీతో సినిమాను నిర్మించ‌బోతున్నారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొంద‌నుంది. మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ “రామాయణ” చిత్రానికి “దంగల్” డైరెక్టర్ నితీష్ తివారి, “మామ్” మూవీ దర్శకుడు రవి ఉద్యావర్ కలిసి దర్శకత్వం వహిస్తారని సమాచారం. 2021వ సంవత్సరంలో మొదటి భాగం విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీలో ‘రాముడి’ పాత్రలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రావణుడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే ప్రభాస్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమాలో సీత పాత్ర కోసం నయనతార పేరును పరిశీలించారు. ఆల్రెడీ బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’లో సీతగా నటించిన అనుభవం ఉండటంతో ఈ సినిమాలో సీత పాత్ర కోసం ముందుగా నయనతార పేరును పరిశీలించారు. ఆ తర్వాత దీపికా పదుకొణే ఈ సినిమాలో సీతగా నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో సీత పాత్ర కోసం ‘సాహో’ భామ శ్రద్ధా కపూర్ పేరును తెరపైకి వచ్చింది. తాజాగా నితిష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిచ్చోరే’ సినిమాలో శ్రద్దాకపూర్‌ నటనకు దర్శకుడు నితిష్ తివారీ ఫిదా అయ్యాడట. అందుకే తాను డైరెక్ట్ చేయబోతున్న”రామాయణం” సీత పాత్ర కోసం ఆమె పేరును పరిగణలోకి తీసుకోవాలని చిత్ర నిర్మాతలకు సూచించనట్టు సమాచారం. ఈ సినిమా డిసెంబర్‌లో పట్టాలెక్కనున్ననేపథ్యంలో ఈలోపే రాముడిగా, రావణాసురుడిగా, సీతగా,మండోదరి వంటి ముఖ్యపాత్రలు ఎవరు చేస్తారనేది ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా హాలీవుడ్ నుంచి 3డి కెమెరాలు తెప్పించారు.

Related posts