కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో ప్రజా రవాణా అంతా బంద్ కాగా జనజీవనం మొత్తం స్తంబించిపోయింది. అటు సినీ నటులు కూడా తమ షూటింగ్స్ ను ఆపేసి ఇళ్లకు చేరుకున్నారు. అయితే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఈ లాక్ డౌన్ కు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో లాక్ డౌన్ ప్రకటించినప్పుడు అజిత్ ‘వాలిమై’ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్లో ఉన్నారు. ఇక కరోనా వైరస్ కట్టడికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ప్రకటించడంతో.. ఆయన హైదరాబాద్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని తమిళ మీడియాలో ఓ కథనం ప్రచారమవుతోంది.
ఆధిపత్యం కోసమే “మా” గొడవలు… తమ్మారెడ్డి భరద్వాజ