కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రవేశ పరీక్షలతో పాటు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. వాయిదాపడ్డ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలు కసరత్తులు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్లతో తెలంగాణ ఉన్నత విద్యామండలి తాజాగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.
సెప్టెంబర్ 14 నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షల పూర్తి షెడ్యూల్ను యూనివర్సిటీలు ప్రకటించే అవకాశం ఉంది. పీజీ, డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షలను అక్టోబర్లో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
పెద్దమ్మ గుడిలో వీహెచ్.. ప్రమాణానికి రాని కేటీఆర్!