హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం ముందు ఓ వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలానిగూడెంకు చెందిన శ్రీనివాస్…బండి సంజయ్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల అరెస్ట్ చేయటాన్ని నిరసిస్తూ ఆత్మహత్య పాల్పడ్డాడు. అయితే…ఈ ఘటనలో 40 శాతం శ్రీనివాస్ శరీరం కాలింది. దీంతో అప్రమత్తమైన స్ధానికులు శ్రీనివాస్ ను ఆస్పత్రికి తరిలించారు. ఆత్మహత్య పాల్పడ్డ గంగల శ్రీనివాస్
యాచారం మండల పరిధిలోని తమ్మలోని గూడం గ్రామ నివాసి. ABVPలో మొదటి నుంచి చురుకైన కార్యకర్త. బిసి యాదవ కుటుంబానికి చెందిన వ్యక్తి. హైదరాబాద్ లో నెట్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్.. లాక్ డౌన్ తరువాత ఇంటి దగ్గరే ఉంటున్నాడు. సిద్దిపేట దగ్గర బండి సంజయ్ని అరెస్ట్ చేయడంతో బాధ గురైయ్యాడు. దీంతో పార్టీ ఆఫీస్ దగ్గర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా బండి సంజయ్ ఇటీవల అరెస్ట్ అయిన తర్వాత దుబ్బాకలో రాజకీయాలు వెడేక్కిన విషయం తెలిసిందే.
previous post
అమృతే రాసినా, పనిలేని వాడు రాసినా ‘మర్డర్’ విషయంలో నా ఆలోచన నాది : ఆర్జీవీ