telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అందుకు చేపలు పట్టి నిరసన తెలిపిన టీడీపీ ఎమ్మెల్యే…

టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయచౌదరి ఆ విషయంలో చేపలు పట్టి నిరసన తెలిపారు. రాష్ట్రం లోని రోడ్ల పై ఉన్న గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో అందులోకిదిగి చేపలు పట్టి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా గోరంట్ల బుచ్చయచౌదరి మాట్లాడుతూ… రాష్టంలో రోడ్లన్నీ గోతులుమయంగా తయారయ్యాయి. రోడ్లు అధ్వాన్నంగా మారటం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి లోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్క రోడ్డుకి కూడా మరమ్మతులు చేయలేదు. రాజమండ్రి లో రెండు యూనిట్ల ఇసుక ను పది వేలకు విక్రయించటం సిగ్గు చేటు.రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా లు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి అని తెలిపారు. అయితే ఎమ్మెల్యే గోతుల్లో చేపలు పట్టడం అనేది ప్రస్తుతం వైరల్ గా మారింది.

Related posts