సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైకాపాకు రాజీనామా చేశారు. ఆయన తదుపరి కార్యాచరణ త్వరలో చెపుతాను అన్నప్పటికీ ఇప్పటికే ఆయనకు తెదేపాలో బెర్త్ ఖరారైందని, అందుకే పార్టీ వీడి టీడీపీలో చేరనున్నారని వార్తలు వచ్చేస్తున్నాయి. ఈ మేరకు ఆయన వైకాపా అధినేత వైఎస్ జగన్కు నేటి ఉదయం లేఖ రాశారు. చాలా ఏళ్లుగా వైకాపాలో కొనసాగిన ఆయన కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.
తాజాగా, వైకాపా నుంచి తెనాలి ఎమ్మెల్యేగా పోటీచేయాలని ఆయన భావించగా.. విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీచేయాలని జగన్ సూచించారు. దీనిపై మనస్తాపంతోనే వైకాపాను వీడాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు కూడా బంధువైన ఆదిశేషగిరిరావు ఇటీవల ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న ద్వారా తెదేపాలో చేరేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతి తర్వాత ఆదిశేషగిరిరావు కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి తెదేపాలో చేరడంపై చర్చించి, పార్టీలో చేరేవిషయమై తుది నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తుంది.
ఎన్నికల సంఘం ఏకపక్షం: యామిని