telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అమరజవాన్ల కుటుంబాలకు సీఎం జగన్ ఆర్థిక సహాయం

cm jagan ycp

ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో మరణించిన ఏపీ రాష్ట్రానికి చెందిన అమరజవాన్ల కుటుంబాలకు రూ.30లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు సీఎం వైయస్‌.జగన్‌. ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో జవాన్ల మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌…ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢసంతాపం వ్యక్తం చేసారు. ఈ రెండు కుటుంబాలను ఆదుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాలకు చెరో రూ.30లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు సీఎం జగన్. ఈ సహాయాన్ని వెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని సీఎమ్ఓ అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్.

Related posts