హైద్రాబాద్ శివారెడ్డి స్వీట్ షాప్లో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందారు. స్వీట్ హౌప్లో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బంది ఓ మహిళ కోసం ఘర్షణ పడ్డారు. తీవ్ర గాయాలపైన ఓ వర్కర్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే మదురానగర్లోని శివారెడ్డి స్వీట్ షాప్లో శ్రీనివాస్, గౌస్ పనిచేస్తన్నారు.
ఓ మహిళ కోసం ఇద్దరి మద్య గొడవ మొదలైంది. దీంతో కోపోద్రిక్తుడైన గౌస్ శ్రీనివాస్ మొహం తలపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడిక్కడే మరణించాడు. మహిళతో వివాహేతర సంబంధంపై శ్రీనివాస్, గౌస్ మద్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.