telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

మహిళ కోసం ఇద్దరి మధ్య గొడవ..గాయాలతో ఒకరు మృతి

crime

హైద్రాబాద్ శివారెడ్డి స్వీట్‌ షాప్‌లో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందారు. స్వీట్ హౌప్‌లో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బంది ఓ మహిళ కోసం ఘర్షణ పడ్డారు. తీవ్ర గాయాలపైన ఓ వర్కర్‌ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే మదురానగర్‌లోని శివారెడ్డి స్వీట్‌ షాప్‌లో శ్రీనివాస్‌, గౌస్‌ పనిచేస్తన్నారు.

ఓ మహిళ కోసం ఇద్దరి మద్య గొడవ మొదలైంది. దీంతో కోపోద్రిక్తుడైన గౌస్‌ శ్రీనివాస్ మొహం తలపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడిక్కడే మరణించాడు. మహిళతో వివాహేతర సంబంధంపై శ్రీనివాస్‌, గౌస్‌ మద్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related posts