telugu navyamedia
క్రీడలు వార్తలు

అప్పుడే అయ్యర్ పూర్తి వివరాలు తెలుస్తాయి : ధావన్

నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ ను 13 పరుగుల తేడాతో ఓడించి ఐపీఎల్ 2020 సీజన్లో 6 వ విజయాన్ని నమోదు చేసింది. ఈ ప్రక్రియలో ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఇందులో క్యాపిటల్స్ చేసిన ప్రదర్శన సమిష్టిగా ఉంది. అయితే ఈ మ్యాచ్ లో వచ్చిన ఏకైక ఆందోళన వారి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తమ జట్టు బౌలింగ్ సమయంలో 5 వ ఓవర్లో గాయపడ్డాడు. బ్యాటింగ్ లో 57 పరుగులతో తమ జట్టు తరపున అత్యధిక స్కోరు సాధించిన క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్, అయ్యర్ గాయం తర్వాత కెప్టెన్ స్థానంలోకి వచ్చాడు. ఇక తాజాగా శ్రేయాస్ అయ్యర్ గాయం గురించి ధావన్ ను అడిగినప్పుడు.. అతను ప్రస్తుతం నొప్పితో ఉన్నాడు కానీ అతని భుజం కదిలిస్తున్నాడు అని చెప్పాడు. గాయం పై స్పష్టత రేపు రిపోట్స్ వచన తర్వాత ఎక్కువగా ఉంటుందని ధావన్ తెలిపారు. 5వ ఓవర్ చివరి బంతికి , శ్రేయాస్ అయ్యర్ మిడ్-ఆఫ్ వద్ద తన ఎడమ వైపుకు బెన్ స్టోక్స్ కొట్టిన బౌండరీని ఆపడానికి డైవ్ చేశాడు. కానీ అప్పుడే గాయం కావడంతో మధ్యలోనే గ్రౌండ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు.

Related posts