telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆ యూవీనివర్సిటీ జాయినింగ్ డేట్ పొడిగింపు…

కరోనా కారణంగా ఇన్ని రోజులు మూసి ఉన్న స్కూల్స్, కాలేజీలు, యూనివర్సీటీలు అని మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పటికే అడ్మిషన్స్ కూడా ప్రారంభించాయి. అయితే డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక యూనివర్సీటీ డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (M.A., M.Com, M.Sc., BLISc, MLISc, పీ.జీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి  చివరి తేది అక్టోబర్ 22 వరకు పొడిగించినట్లు యూనివర్సీటీ ఇంఛార్జి రిజిస్ట్రార్ డా. జి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయ స్టడీ సెంటర్స్ లో ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను www.braouonline.in లో పొందుపర్చినట్లు వెల్లడించారు. ఇంటర్మీడియెట్, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు, యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో 2016 నుంచి 2019 వరకు పాసైన విద్యార్థులు కూడా నేరుగా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చని సూచించారు. అలాగే ఇప్పటికే అడ్మిషన్ పొంది ఉండి వివిధ కారణాలతో సకాలంలో ట్యూషన్ ఫీ చెల్లించలేకపోయిన డిగ్రీ కోర్సు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు, పీజీ కోర్సుల్లో చేరి అడ్మిషన్ ఫీ కట్టలేక పోయిన వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించికోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600 లేదా విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం 040-23680333 / 555 ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చని పేర్కొన్నారు.

Related posts