telugu navyamedia
సినిమా వార్తలు

మెల్‌బోర్న్‌ ఫిల్మ్ ఫెస్టివల్… ముఖ్య అతిథిగా బాలీవుడ్ బాద్‌షా

Shah-Rukh-Khan

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ మెల్‌బోర్న్‌లో ఆగ‌స్ట్ 8 నుండి 17వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న వార్షిక భార‌తీయ చ‌ల‌న చిత్ర ప్ర‌ద‌ర్శ‌న ఉత్స‌వానికి ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్నారు. ఆస్ట్రేలియాకి చెందిన విక్టోరియా గ‌వ‌ర్న‌మెంట్ షారూఖ్‌కి ఆహ్వానం పంప‌గా, త‌న‌కి ఈ గౌరవం ద‌క్క‌డంపై షారూఖ్ ఖాన్ సంతోషం వ్య‌క్తం చేశారు. “చ‌క్ దే ఇండియా” మూవీ చిత్రీక‌ర‌ణ ఎక్కువ భాగం మెల్ బోర్న్‌లోనే జ‌రిగింది. మెల్‌బోర్న్‌లో నాకు చాలా జ్ఞాప‌కాలు ఉన్నాయి. విక్టోరియా ప్ర‌భుత్వం నుండి ఆహ్వానం పంప‌డం చాలా సంతోషాన్నిచ్చింది” అని షారూఖ్ తెలిపారు. ఐఎఫ్ఎఫ్ఎమ్ ప‌ద‌వ ఎడిష‌న్ కార్య‌క్ర‌మం ఈ నెల 8న ప్రారంభం కానుండ‌గా, ఆ రోజు షారూఖ్ ఖాన్‌తో పాటు డానియ‌ల్ ఆండ్రూస్‌, మితు బౌమిక్ లాంగే త‌దిత‌రులు హాజ‌రు కానున్నారు.

Related posts