ఇరాక్ రాజధాని బాగ్ధాద్ లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన బాంబుపేలుళ్లలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. బాగ్ధాద్ నగరంలోని అల్ షాబ్ నైబర్హుడ్ మార్కెట్లో మోటారుసైకిలు బాంబు పేలింది. ఈ బాంబు పేలుడులో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో 9 మంది గాయపడ్డారు. బాగ్ధాద్ నగరంలోని అల్ బయ్యా నైబర్ హుడ్ ప్రాంతంలో మరో బాంబు పేలిన ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మూడో బాంబు అల్ బలాదీయత్ నైబర్ హుడ్ ప్రాంతంలో పేలింది. ఈ పేలుడులో మరో నలుగురు గాయపడ్డారు.
ఒకేరోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన బాంబు పేలుళ్లకు కారణం ఏవరనేది ఇంకా తెలియలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులే బాంబు పేలుళ్లకు పాల్పడి ఉంటారని బాగ్ధాద్ పోలీసులు భావిస్తున్నారు.గాయపడిన 17 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.