రాజమౌళి దర్శకత్వంలో రామ్చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు గా కనిపించనున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్లో భాగంగా ‘దోస్తీ’ పాటను స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం విడుదలైంది. పాటలో తారక్, చరణ్ల మధ్య దోస్తీని ప్రతిబింబించేలా ఉంది. ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాట ,.హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.
ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. హేమచంద్ర (తెలుగు), అమిత్ త్రివేది (హిందీ), అనిరుధ్ (తమిళం), యాసిన్ నజీర్ (కన్నడ), విజయ్ జేసుదాస్ (మలయాళం).. ఇలా ఐదు భాషలకు చెందిన ఐదుగురు యువ సింగర్స్ పాడారు. అయితే అక్టోబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.