సెలినా జైట్లీ తన ‘సీజన్స్ గ్రీటింగ్స్’ చిత్రంతో మరోసారి తన అభిమాలను పలకరించనున్నారు. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సెలినా 2016లో నటించిన ‘సీజన్స్ గ్రీటింగ్స్’ షార్ట్ ఫీలీం లాక్డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 15న జీ5లో ప్రసారం కానుంది. కరోనా వైరస్ సంక్షోభ సమయాల్లో తన సినిమా ప్రసారంపై ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. “నా సినిమా చివరి పోస్టును 2011లో పంచుకున్నాను. మళ్లీ నా తదుపరి సినిమా పోస్టును పంచుకోవడానికి ఇన్నేళ్లు పడుతుందని, అది కూడా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అని అస్సలు ఊహించలేదు. అలాగే ఒక చిన్న వైరస్ కారణంగా ప్రపంచమంతా మూసివేయ బడుతుందని కూడా. నా ప్రతి సినిమాపై ఎప్పటి లాగే వారి అభిప్రాయం చెప్పే నా తల్లిదండ్రులు సజీవంగా ఉండరని… ఇక నేను వివాహం చేసుకుని యూరప్లో నివసిస్తానని, నా తర్వాతి చిత్రం ఓ ముగ్గురి పిల్లలకు తల్లి అయ్యాక వస్తుందని ఏప్పుడు కూడా అనుకోలేదు. అలాగే భవిష్యత్తులో ఓ రోజు 377 సెక్షన్ ఎత్తివేయబడి, ఎల్జీబీటీక్యూ సాధించే జీవిత హక్కు పొందే రోజు ఒకటి వస్తుందని, ట్రాన్స్ జెండర్స్తో కలిసి నటించే అవకాశం నాకు దగ్గుతుందనుకోలేదు అన్నారు. తన సినిమా టైటిట్ను ఉద్దేశిస్తూ.. “నా ప్రయాణంలోని ఈ సీజన్లలో జీవితం అనూహ్యమని నేను తెలుసుకున్నాను. మనం రేపు కోసం వేచి ఉండకుండ.. ఈ రోజును ఉత్తమంగా చూడాలి. శీతాకాలపు లోతులో వసంతకాలం వాగ్దానాన్ని చూడటం కొనసాగించాలని నిర్ణయించుకున్నాము, ఈ లాక్డౌన్లో మా చిత్రం ఖచ్చితంగా వినోదాన్ని అందిస్తుందని కోరుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు.
previous post