telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : మరో విజయం సాధించిన కోహ్లీ సేన

ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో బెంగళూరు హ్యాట్రిక్ విజయం సాధించింది. ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు మొదట్లో వరుణ్ చక్రవర్తి షాక్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మాక్స్వెల్(78) పరుగులు చేసాడు. కానీ మాక్స్వెల్ పెవిలియన్ చేరిన తర్వాత మిస్టర్ 360 డివిలియర్స్(76) పరుగులు చేయడంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది అయితే ఈ మ్యాచ్ లో 205 పరుగుల భారీ లక్థ్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కు మంచి ప్రారంభమే దక్కింది. కానీ ఆ తర్వాత బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కేకేఆర్ బ్యాట్స్మెన్స్ ను కట్టడి చేసారు, వచ్చిన వారిని ఎవరిని క్రీజులో కుదురుకోనివ్వలేదు. చివర్లో బెంగళూరు బౌలర్లు వరుస వికెట్లు తీయడంతో కేకేఆర్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేసింది. దాంతో కోహ్లీసేన 38 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Related posts