telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

భయపెడుతున్న జాన్వీ కపూర్…

అతిలోక సుందరి వారసురాలు జాన్వీ కపూర్ . సినిమా రంగం లో వారసత్వాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్, బడ ప్రొడ్యూసర్  కూతురుగా  సినిమాలు చేయడం చాలా బాధ్యతలతో కూడుకుంది. అయితే ‘ధడక్’ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తుంది. ఈ లాక్ డౌన్ లో ఓటీటీ వేదికగా జాన్వీ నటించిన వైమానిక దళ అధికారిణి గుంజన్ సక్సేనా బయోపిక్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం జాన్వీ రాజ్ కుమార్ రావుతో కలిసి నటించిన రూహి రిలీజ్ కి రానుంది. ఈ సినిమాకు హార్దిక్‌ మెహతా దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో హారర్‌, కామెడీని చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. జాన్వీ నటన ప్రధానంగా నిలుస్తుంది. హార్ర‌ర్, కామెడీ స‌న్నివేశాలు ఎక్కువగా క‌నిపిస్తున్నాయి. ద‌ర్శ‌కుడు హార్దిక్ మెహతా ఈ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని భ‌య‌పెట్టించ‌డంతో పాటు న‌వ్వించ‌నున్నాడు. అయితే మార్చి 11న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా… లేదా అనేది చూడాలి.

Related posts