telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

భారత్ కు మరో షాక్… ఉమేష్ యాదవ్ కూడా

భారత జట్టుకు మరి షాక్ తగిలింది. భారత పేసర్ ఉమేష్ యాదవ్ ఆసీస్ సిరీస్ కు దూరమయ్యాడు. అయితే ఈ పర్యటన ప్రారంభం అయిన దగ్గర నుండి భారత జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మకు ఐపీఎల్ లో గాయం కావడంతో వారు ఈ పర్యటన నుండి తప్పుకున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు రోహిత్ జట్టులోకి వచ్చాడు. అలాగే టీ20 సిరీస్ లో జడేజా కు గాయం కావడంతో అతను మొదటి టెస్ట్ కు దూరమయ్యాడు. ఆ తర్వాత మొదటి టెస్ట్ మ్యాచ్ లో మరో పేసర్ షమీకి గాయం కావడంతో అతను టెస్ట్ సిరీస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక తాజాగా ఉమేష్ యాదవ్ ది కూడా అదే పరిస్థితి. రెండో టెస్ట్ మ్యాచ్ లో బౌలింగ్ చేస్తున్న సమయంలో ఉమేష్ భయం బారిన పడ్డాడు. ఆ తర్వాత ఆ మ్యాచ్ లో ఆడని ఉమేష్ ఇప్పుడు మొత్తం సిరీస్ కే దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఉమేష్ ఆడటం లేదు. తర్వాతి టెస్టుకు కూడా సందేహమే అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇక ఈ పర్యటనలో ఉమేష్ యాదవ్ రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అయితే షమీ స్థానంలో రెండో తేసులోకి సిరాజ్ ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు మూడో టెస్ట్ కు ఉమేష్ స్థానంలో సైని లేదా నటరాజ్ రావాల్సి ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ లకు న్యాయకత్వం వహిస్తున్న అజింక్య రహానేకు ఇది పెద్ద సవాలే అని చెప్పాలి.

Related posts