రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను సాధించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్ధేశం చేశారు.
నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాల వారిగా సమగ్రమైన అభివృద్ధికి అన్ని విభాగాలు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.
విజన్ డాక్యుమెంట్ కేవలం ప్రచారానికి పరిమితమనే అపోహను తిప్పికొట్టేలా, ప్రతి అంశంపై లక్ష్యాలను చేరుకోవడానికి ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
అన్ని విభాగాలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేస్తే 2047 లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని చెప్పారు.
ప్రభుత్వంలోని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు, సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమై దాదాపు ౩ గంటలకుపైగా సమీక్షించారు.
రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.

