ప్రజా యుద్ధనౌక, తెలంగాణ పోరాటయోధుడు గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.
అణచివేతకు వ్యతిరేకంగా తన ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన పోరాటవీరుడు గద్దర్ అని ఆయన స్మరించుకున్నారు.
సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన గొంతుక గద్దర్ అని కొనియాడారు.
గద్దర్ గారి జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, ఆయన పేరుతో అవార్డును నెలకొల్పి ప్రతి ఏటా కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు.
గద్దర్ గారి పాటలు, ఆలోచనలు, పోరాటస్ఫూర్తి ప్రజల మధ్య శాశ్వతంగా జీవిస్తాయని పేర్కొన్నారు.

