telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.

అహింసను ఆయుధంగా, సత్యాన్ని మార్గంగా చేసుకొని భారతదేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన మహానీయుడు మహాత్మాగాంధీ ని కొనియాడారు.

వారి జీవితం మనకు ధైర్యం, సహనం, మానవత్వం నేర్పిన అమూల్యమైన పాఠమని, గాంధీ ఆదర్శాలను మన జీవితాల్లో ఆచరించడమే వారికి నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.

గాంధీ వర్ధంతి సందర్భంగా నిర్వహించే ‘అమరవీరుల సంస్మరణ దినం’ సందర్భంగా దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీరులను స్మరించుకున్నారు.

Related posts