telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక : కాంగ్రెస్‌ సంచలన నిర్ణయం

congress flags

తెలంగాణలో ఇటీవలే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ భారీ విజయాన్ని సాధించింది. తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ రావడంతోనే.. అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నకపై ఫోకస్‌ పెట్టాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జానారెడ్డి పేరు ఖరారు చేశారు. ఇక ఇప్పటికే అన్ని పార్టీలు ఆ నియోజకవర్గంలో ప్రచారాన్ని మొదలు పెట్టేశాయి. అయితే… తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ప్రకటించాలని కోరుతూ కమ్యూనిస్టు పార్టీలకు కాంగ్రెస్ లేఖలు రాసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలకు లేఖలు రాసారు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అంతేకాదు ఫోన్ లో కూడా వారితో మాట్లాడారు కాంగ్రెస్ నేతలు. ఒకటి, రెండు రోజులలో కమ్యూనిస్టు పార్టీల కార్యదర్శులతో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాగర్‌ ఉప ఎన్నికల్లో ఎలాగైనా.. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టాలని అటు కాంగ్రెస్‌ ఇటు కమ్యూనిస్టు పార్టీలు అనుకుంటున్నట్లు సమాచారం. కాగా…నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ఏప్రిల్‌ 17న జరుగనుంది.

Related posts