telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కొడంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ  రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది.

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కొడంగల్ లో ఓటు వేశారు.

వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ జడ్పీ హైస్కూల్‌ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరిగి బయల్దేరారు.

Related posts