telugu navyamedia
క్రీడలు వార్తలు

రికార్డు వ్యూయర్‌షిప్‌ సాధించిన ముంబై-చెన్నై మ్యాచ్…

నిన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ వ్యూయర్‌షిప్ పరంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రెండు టాప్ జట్ల మధ్య సిక్సులు, బౌండరీల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తి కనబర్చారు. దాంతో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌ల కన్నా ఈ మ్యాచ్ అత్యధిక వ్యూయర్‌షిప్‌ను సాధించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 8.4 మిలియన్ల మంది ఈ మ్యాచ్ లైవ్‌ను వీక్షించారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే రికార్డు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో సిక్సులు వర్షం కురిసింది. చెన్నై ఆటగాళ్లు మొయిన్‌ అలీ 5, ఫాఫ్ డుప్లెసిస్‌ 4, అంబటి రాయుడు 7 సిక్సర్లు బాదారు. ఇదే హైలట్ అనుకుంటే.. ముంబై హార్డ్ హిట్టర్ కిరాన్ పొలార్డ్‌ ఏకంగా 8 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ తలో సిక్స్ బాధగా.. కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా తలో రెండు సిక్సర్లు బాదారు. చెన్నై 16 సిక్సులు బాదితే.. ముంబై 14 సిక్సులు కొట్టింది. సిక్సుల వర్షం కురవడం, చివరి బంతి వరకు మ్యాచ్ రసవత్తరంగా సాగడంతో.. అభిమానులు మ్యాచ్ చూసేందుకు ఆసక్తి కనబర్చారు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌ను హాట్‌స్టార్‌లో 8 మిలియన్ల మంది చూసారు. అదే అప్పుడు రికార్డు వ్యూయర్‌షిప్‌. ఈ సీజన్లో జరిగిన చెన్నై-ముంబై మ్యాచ్ 8.4తో దాన్ని అధిగమించింది. మొత్తానికి ఈ రెండు జట్ల ఎప్పుడు గేమ్ జరిగినా.. మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తి కనబరాస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచును డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 7 మిలియన్ల మంది చూశారు.

Related posts