telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చేతబడి, క్షుద్రపూజల నేపథ్యంలో రానా సినిమా

Rana

టాలీవుడ్ లో కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలు ఎంచుకుంటూ వైవిద్యభరితమైన పాత్రలు పోషిస్తున్న రానా… తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకున్నారు. ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే ఈ కొత్త పెళ్లి కొడుకు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ స్టోరీని ఓకే చేశారని తెలుస్తోంది. సీనియర్ దర్శకులు మణిరత్నం శిష్యుడు మిలింద్ రావ్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుందని, జనవరి నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. గతంలో ‘గృహం’ లాంటి హారర్ సినిమాతో భయపెట్టిన మిలింద్ రావ్.. ఇటీవలే రానాకు తన వద్ద ఉన్న మరో హారర్ కథ వినిపించారట. చేతబడి, క్షుద్రపూజల నేపథ్యంలో ఉన్న ఈ స్టోరీ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట రానా. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. తెలుగులో ‘ధీరుడు’ అనే స్ట్రాంగ్ టైటిల్ పరిశీలనలో పెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే.. రానాకు ఇదే మొదటి హారర్ మూవీ అవుతుంది.

ఇకపోతే రానా తన లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘అరణ్య’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా, తమిళంలో ‘కాండ‌న్’ గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలను కరోనా కారణంగా వాయిదా వేశారు. మరోవైపు రానా హీరోగా ‘విరాటపర్వం 1992’ పేరుతో మరో సినిమా రాబోతోంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం రానా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Related posts