మన దేశంలో పబ్జీకి ఎంత క్రేజ్ ఉందొ చెప్పాల్సిన అవసరం లేదు.. అలాంటి పబ్జీని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధించింది. కానీ ప్రస్తుతం పబ్జీ ప్రేమికుల ఓ తీపికబురు అందించింది. పబ్బీ మొబైల్ భరత్లోకి మళ్లీ వచ్చేస్తోంది. చైనా మార్క్ లేకుండా దేశంలోకి సరికొత్తగా అడుగు పెట్టబోతోంది. తాజాగా పబ్జీ కార్పొరేషన్కు చెందిన పబ్జీ, పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ ఇండియా, పబ్జీ మొబైల్ లైట్ పేర్లను కంపెనీ సబ్సిడరీ కంపెనీలుగా కార్పొరేట్ మంత్రిత్వశాఖ వద్ద రిజిష్టర్ చేసింది. దీంతో వీలైనంత త్వరలో ఈ గేమ్ను భారత్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. కొద్దీ రోజుల క్రితం భారత వినియోగదారుల కోసం “పబ్ జి మొబైల్ ఇండియా” పేరుతొ కొత్త యాప్ ని కూడా తీసుకువచ్చింది. డిసెంబర్ మొదటి వారంలో గ్రాండ్ గా విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధం అవుతున్నారట. కొద్ది నెలల క్రితం భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం 117 యాప్లపై కేంద్రం నిషేధం విధించింది. భారత్ లో పబ్జీ ఎప్పుడు విడుదల అవుతుందా అని పబ్ జీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పబ్ జీ ప్రియుల సుదీర్ఘ నిరీక్షణ తొందరలోనే ముగియనుంది. ఈ వార్త తెలిసిన తర్వాత పబ్ జీ ప్రియులు పండుగ చేసుకుంటున్నారు.
previous post
next post
చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారు: మంత్రి కన్నబాబు