ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని నేరుగా కన్యాకుమారి చేరుకున్న సంగతి తెలిసిందే.
మొదట ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ ను సందర్శించిన ప్రధాని… ఆ తర్వాత శ్రీపాద మండపంలో భగవతి అమ్మవారి పాదముద్రలకు పుష్పాభిషేకం చేశారు.
ఆపై, కాషాయ వస్త్రాలు ధరించి ఇక్కడి ధ్యానమందిరంలో కూర్చున్నారు.
నిన్న సాయంత్రం నుంచి మోదీ ధ్యానం కొనసాగుతోంది. జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు ప్రధాని ధ్యానంలోనే కూర్చోనున్నారు.
రేపు దేశంలో చివరిదైన ఏడో విడత ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. రేపటితో మొత్తం ఏడు దశల పోలింగ్ పూర్తవుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.