తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ పరువు హత్య కేసు విచారణ వాయిదా పడింది. నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఈరోజు ఈ కేసు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా నిందితులు సుభాష్ శర్మ, అస్గర్ అలీలను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
మరోవైపు అమృత బాబాయ్ శ్రవణ్ కోర్టుకు హాజరుకాలేదు. కేసులో ఏ1 నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్టు కోర్టుకు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కేసు విచారణను ఈ నెల 23కు వాయిదా వేస్తున్నట్టు జడ్జి ప్రకటించారు.
ఐఏఎస్ లు ముఖ్య పాత్ర నిర్వహించాలి: నితిన్ గడ్కరీ