కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ వల్ల ముఖ్యంగా రోజువారి కూలీ పనులు చేసుకునే జీవితాన్ని కొనసాగిస్తున్న జనాలు తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కోంటున్నారు. ఈ క్రమంలో వలస కూలీలకు అండగా ప్రబుత్వాలతోపాటు ప్రముఖులు విరాళాలతో పటు ఆహారాన్ని కూడా పంచుతున్నారు. ఆ కోవలోకి వస్తాడు నటుడు ప్రకాష్ రాజ్. ఆయన తన స్థోమతకు తగ్గట్లుగా చుట్టు పక్కల ఉన్న జనాలకు సాయం చేస్తూ ఈ ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నాడు. మరోవైపు ప్రకాష్ రాజ్ ఈ లాక్ డౌన్ కాలంలో భార్యాపిల్లలతో తన ఫామ్ హైజ్ లో గడుపుతున్నాడు. అది అలా ఉంటే ప్రకాష్ రాజ్ తన ఫామ్ హౌజ్లో పండిన మామిడికాయలను అమ్ముతున్నాడు. ఈ అమ్మకంలో ఆయన నాలుగేళ్ల కుమారుడు తోడుగా ఉన్నాడని.. తన కుమారుడు తన తోటలో పండిన మామిడికాయలను అమ్ముతూ ప్రకృతిలో ఒడిలో ఒదిగిపోయాడని పేర్కోన్నాడు. దీనికి సంబందించిన ఓ ఫోటోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇక ప్రకాష్ ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగ మార్తండలో నటిస్తున్నాడు.
My son ..The mango seller .. in conversation with nature at our farm. Stay home stay safe. This too shall pass. pic.twitter.com/dpzBcJQNVs
— Prakash Raj (@prakashraaj) April 26, 2020


జగన్ ను సపోర్ట్ చేసినందుకు ఆ నిర్మాత సినిమాలోంచి తీసేశారు… : పోసాని