telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దీపికా, రణ్‌వీర్ పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం

ranveer singh

బాలీవుడ్ జంట దీపికా, రణ్‌వీర్ పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అందిస్తున్నట్లుగా తెలిపారు. ‘ఇలాంటి సమయంలో ప్రతి చిన్న సహాయం కూడా ఉపయోగపడుతుంది. పీఎం కేర్స్ ఫండ్‌కు తమ వంతు సాయం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనమంతా ఐకమత్యంగా ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి తప్పకుండా బయటపడతాం. జైహింద్. ’ అని దీపిక రణ్‌వీర్ ట్వీట్ చేశారు. అయితే తాము ఎంత విరాళం ఇస్తున్నామనే విషయాన్ని మాత్రం ఈ హాట్ కఫుల్ బయటకు చెప్పలేదు. పీఎం-కేర్స్ నిధికి విరాళాలు ఇవ్వడంతోపాటు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న టాలీవుడ్, బాలీవుడ్ తారలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.

Related posts