telugu navyamedia
సినిమా వార్తలు

కొత్త దర్శకుడితో శ్రీవిష్ణు ప్రయత్నం

Srivishnu

యంగ్ హీరో శ్రీవిష్ణు నెమ్మదిగా కథలను ఎంచుకుంటూ వరుస హిట్లను సొంతం చేసుకుంటున్నారు. శ్రీవిష్ణు ఎంచుకునే క‌థ‌ల‌న్నీ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని బాగా ఆక‌ట్టుకుంటాయి. శ్రీ‌విష్ణుకి లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ‌గా ఉంటారు. ఇప్పటికే మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు విలక్షణ నటుడు శ్రీవిష్ణు. తాజాగా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. శ్రీవిష్ణు హీరోగా ఇటీవల విడుదల అయి ఘన విజయం సాధించిన ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వ టీమ్ లో ప్రతిభ కనబరచిన ‘హాసిత్ గోలి’ ని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్. శ్రీవిష్ణు, హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరిలో ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు వివేక్ కూచి భొట్ల, కీర్తి చౌదరి. ప్రస్తుతం ఈ హీరో “తిప్పరా మీసం” అనే వైవిధ్యమైన చిత్రంలో నటిస్తున్నారు.

Related posts