కె.జి.ఎఫ్: చాప్టర్ 2 సినిమా క్లైమాక్స్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం కె.జి.ఎఫ్ టీమ్ హైదరాబాద్ వస్తోంది అని ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన వ్యక్తి ఒకరు ముంబై మిర్రర్కు వెల్లడించారు. బెంగళూరులో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇవి పూర్తయిన వెంటనే టీమ్ హైదరాబాద్కు బయలుదేరుతుంది. అక్కడ వేసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ సెట్లో 20 రోజుల పాటు షూటింగ్ జరుగుతుంది. క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ చిత్రీకరణ కోసం హీరో యష్ గత కొన్ని నెలలుగా చాలా కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారని తెలిపారు. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అధీరాగా సంజయ్ కనిపించనున్నారు. ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 2’లో రాకీ భాయ్, అధీరా మధ్య పెద్ద యుద్ధమే జరగబోతోంది. “సంజయ్ ఇప్పటికే తన సన్నివేశాలను చాలా వరకు పూర్తి చేశారు. కొన్ని సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ కోసం నవంబర్ తొలి వారంలో సంజయ్ టీమ్తో జాయిన్ అవుతారు’’ అని ఆ వ్యక్తి వెల్లడించారు. కాగా, సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం ఆయన కాస్త విరామం తీసుకున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 23న విడుదల చేయాలని భావించారు. కానీ, లాక్డౌన్ వల్ల షూటింగ్ ఆగడంతో సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.
previous post
next post
బాలకృష్ణ హీరో… ఆయనంటే ప్రత్యేక గౌరవం… : నాగబాబు