telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రకాష్ రాజ్ కొడుకు ఏంచేస్తున్నాడో తెలుసా..!

Prakash

కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ వల్ల ముఖ్యంగా రోజువారి కూలీ పనులు చేసుకునే జీవితాన్ని కొనసాగిస్తున్న జనాలు తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కోంటున్నారు. ఈ క్రమంలో వలస కూలీలకు అండగా ప్రబుత్వాలతోపాటు ప్రముఖులు విరాళాలతో పటు ఆహారాన్ని కూడా పంచుతున్నారు. ఆ కోవలోకి వస్తాడు నటుడు ప్రకాష్ రాజ్. ఆయన తన స్థోమతకు తగ్గట్లుగా చుట్టు పక్కల ఉన్న జనాలకు సాయం చేస్తూ ఈ ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నాడు. మరోవైపు ప్రకాష్ రాజ్ ఈ లాక్ డౌన్ కాలంలో భార్యాపిల్లలతో తన ఫామ్ హైజ్ లో గడుపుతున్నాడు. అది అలా ఉంటే ప్రకాష్ రాజ్ తన ఫామ్ హౌజ్‌లో పండిన మామిడికాయలను అమ్ముతున్నాడు. ఈ అమ్మకంలో ఆయన నాలుగేళ్ల కుమారుడు తోడుగా ఉన్నాడని.. తన కుమారుడు తన తోటలో పండిన మామిడికాయలను అమ్ముతూ ప్రకృతిలో ఒడిలో ఒదిగిపోయాడని పేర్కోన్నాడు. దీనికి సంబందించిన ఓ ఫోటోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇక ప్రకాష్ ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగ మార్తండలో నటిస్తున్నాడు.

Related posts