telugu navyamedia
తెలంగాణ వార్తలు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర : మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి నోటీసులు ఇవ్వనున్న పోలీసులు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రను పోలీసులు భగ్నం చేయడంతో రాష్ట్రంలో తీవ్ర‌ క‌ల‌క‌లం రేగింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ కేసుకి సంబంధించి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు.”ఈ కుట్ర వెనక ఉన్న వాళ్లందరినీ అదుపులోకి తీసుకుని లోతుగా ప్రశ్నించ‌నున్నారు..

జితేందర్ రెడ్డి డ్రైవర్‌ను, పీఏను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. మంత్రి హత్య కుట్ర కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చారు జితేందర్ రెడ్డి పీఏ రాజు , డ్రైవర్ తాపా. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుల నుంచి రివాల్వర్‌, బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కస్టడీ కోసం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెస్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు 15 కోట్ల డీల్ జరిగినట్టుగా.. కుట్రలో భాగమైన 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సుపారీ గ్యాంగ్‌తో మహబూబ్‌నగర్‌ వాసులే హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ హత్యకు కుట్ర జరిగిందనేందుకు ఆధారాలు లభించాయని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.

సుపారీ హత్య కోసం మొదట ఫరూక్‌ అనే వ్యక్తిని ఆశ్రయించగా.. అతడు బయటపెడతాడేమో అనే భయంతో అతడిని చంపేందుకు ప్రయత్నించారు. ఆ దాడి నుంచి తప్పించుకున్న ఫరూక్​.. పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించాం అన్నారు. అక్కడి నుంచి ప్రారంభమైన దర్యాప్తులో భాగంగానే.. మంత్రిపై హత్య కుట్ర విషయం బయటపడిందని తెలిపారు. ఈ మొత్తం కుట్రలో తమకు ప్రధానంగా ముగ్గురి పేర్లు బయటపడ్డాయని.. మిగతావారి పాత్రపైనా కూడా ఆరా తీస్తున్నామని సీపీ వెల్లడించారు.

ఫిబ్రవరి 23న ఫరూక్‌, హైదర్‌ అనే ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్​లోని సుచిత్ర వద్ద ఓ లాడ్జీలో దిగారు. ఫిబ్రవరి 25న ఫరూక్‌, హైదర్‌పై ఒక ముఠా దాడి చేశారు. ఆ దాడి నుంచి తప్పించుకుని.. తమపై హత్యాయత్నం జరిగిందని పేట్‌బషీరాబాద్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. వాళ్లిద్దరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దాడికి యత్నించింది.. యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్‌ అని తేలింది. ఫిబ్రవరి 26న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి విచారించారు.

విచారణలో మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో రాఘవేంద్రరాజు, అమరేంద్రరాజు, రవి, మధుసూదన్‌ ప్రమేయం ఉన్నట్లు నిందితులు బయటపెట్టారు. అసలు ఇంత మంది ఫరూక్, హైదర్​ల మీద ఎందుకు దాడి చేశారని లోతుగా విచారిస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది.​ ఈ ముఠా అంతా కలిసి మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హత్యకు కుట్ర పన్నినట్లు తెలిసింది.

Related posts