చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదంపై సినీ హీరో, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.
ఎంతో సంతోషంతో నిశ్చితార్థం వేడుకలకు అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుచానూరుకు వెళుతున్న బృందం ప్రమాదానికి గురై ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోవడం… చాలా మంది తీవ్రంగా గాయపడడం మనసును తీవ్రంగా కలచి వేసిందన్నారు.
గాయపడినవారిలో కొందరి పరిస్థితి ఆందోళకరంగా ఉండడం మరింత విషాదకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. బస్సు లోయలోకి బోల్తాకొట్టి చాలాసేపటి వరకు ఈ ప్రమాదాన్ని ఎవరూ గుర్తించలేదని తెలిసి భాద అనిపించిందన్నారు. ఆ సమయంలో సహాయం అందక క్షతగాత్రులు ఎంత వేదన అనుభవించారో ఊహిస్తేనే గుండె భారంగా మారుతోందన్నారు.
బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారని…. ఇది దురదృష్టకరమన్నారు. ఇటువంటి బస్సుల యాజమాన్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి… లేనిపక్షంలో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.


ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ కొత్త డ్రామా: లోకేశ్ ఫైర్