ప్రపంచ వ్యాప్తంగా కరోనా పై పోరాటం చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం తన వక్ర బుద్ధిని మాత్రం పోనిచ్చుకోవడం లేదు. ఇప్పటివరకు పాకిస్థాన్ ఉగ్రవాదులను మాత్రమే ఎగుమతి చేసిన పాక్, ఇపుడు కరోనా రోగులను కూడా ఎగుమతి చేస్తుందని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ అన్నారు. కశ్మీర్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు.
కశ్మీర్ వాసులకు కరోనా వ్యాప్తి చేసేందుకు పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా కరోనా రోగులను ఇక్కడికి పంపిస్తుందని ఆరోపించారు. ఇది ఆందోళన కలిగించే విషయమని తెల్లిపారు. ముందు జాగ్రత్తలు తీసుకునే అవసరం ఎంతైనా ఉందని డీజీపీ అభిప్రాయపడ్డారు.ఓ వైపు ప్రపంచదేశాలతోపాటు భారత్ కరోనా మహమ్మారిపై పోరు చేస్తుంటే..పాకిస్థాన్ మాత్రం కొన్నాళ్లుగా జమ్మూకశ్మీర్ లోకి ఉగ్రవాదులను పంపిస్తూ కాల్పులు విరమణ ఒప్పందాలను పదే పదే ఉల్లంఘిస్తోందన్నారు.


టీడీపీ హయాంలోనే బోటుకు అనుమతి: మంత్రి అవంతి