రాష్ట్రంలో కరోనా చర్యలపై జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెడ్, ఆరెంజ్ క్లస్టర్లలో నిర్దేశించుకున్న నిబంధనలను పాటించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా విస్తరణ, పరీక్షల వివరాల గురించి జగన్ కు అధికారులు వివరించారు. అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఐసీయూ బెడ్ల సంఖ్యను పెంచాలని ఏపీ సీఎంజగన్ ఆదేశించారు.
ఇప్పటివరకు 41,512 మందికి పరీక్షలు నిర్వహించామని, నిన్న ఒక్క రోజే 5,757 పరీక్షలు చేశామని, ట్రూనాట్ పరీక్షల నమోదుకు ఐసీఎంఆర్ అనుమతిచ్చిందని, కొరియా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు మంచి పనితీరు కనబరుస్తున్నాయని అధికారులు తెలిపారు. వీలైనన్ని బెడ్లకు ఆక్సిజన్ సరఫరా అయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు జగన్ సూచించారు.
మంగళగిరిలో తనకు సరైన పోటీ లోకేష్ కాదు: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే