అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. 90లలో లేడీ సూపర్స్టార్గా అద్భుతమైన స్టార్డమ్ సంపాదించిన విజయశాంతి మళ్ళీ 13 ఏళ్ళ తర్వాత సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ సినిమాపై ఆమె అభిమానులలో చాలా ఆసక్తి నెలకొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. అతి తక్కువ టైంలో యూ ట్యూబ్లో సెన్సేషనల్ స్టార్గా మారిన గంగవ్వ తాజాగా “సరిలేరు నీకెవ్వరు” ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందాన్ని కలిసింది. దర్శకుడు అనీల్ రావిపూడితో పాటు చిత్రబృందాన్ని కలిసి పలు ప్రశ్నలు వేసింది. సినిమాకి సంబంధించిన అనేక ఆసక్తిర విషయాలు అడిగి తెలుసుకుంది. గంగవ్వతో సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం జరిపిన ఫన్నీ ముచ్చట్లకి సంబంధించిన వీడియోని తాజాగా విడుదల చేశారు. ఈ వీడియో నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
previous post