telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్

నేను వెళ్లక ముందే వివేకా రాసిన లేఖ, సెల్‌ఫోన్‌ను దాచేశారు: అవినాశ్ రెడ్డి

 మాజీ మంత్రి వివేకా హత్యపై ఎంపీ అవినాశ్ రెడ్డి స్పందించారు. వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. వివేకా మరణించినట్లు శివప్రకాష్‌రెడ్డి తనకు చెప్పారన్నారు. తాను అప్పటికే జమ్మలమడుగుకు వెళ్తున్నానన్నారు. పులివెందుల రింగ్‌రోడ్డు దగ్గరున్నప్పుడు కాల్‌ వచ్చిందన్నారు. ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయా అని అడిగానన్నారు. తాను వెళ్లక ముందే వివేకా రాసిన లేఖ, సెల్‌ఫోన్‌ను దాచేశారన్నారు. డ్రైవర్‌ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దని వివేకా లేఖ రాశారన్నారు. లేఖ, సెల్‌ఫోన్‌ దాచమని రాజశేఖర్‌రెడ్డి చెప్పారని అవినాశ్‌రెడ్డి వెల్లడించారు.

లెటర్‌లో డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేశారని వివేకా రాశారన్నారు. డ్రైవర్ ప్రసాద్ మంచోడు, అతని గురించి వివేకా లేఖ రాశారని తెలిస్తే.. ప్రసాద్‌పై దాడి చేస్తారనే లేఖ దాచినట్టు రాజశేఖర్‌రెడ్డి తనకు చెప్పారని అవినాశ్‌ రెడ్డి వెల్లడించారు. మీ నాన్న కంటే డ్రైవర్‌ ప్రసాద్‌నే నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఆ లెటర్‌పై సీబీఐ ఎందుకు ఫోకస్‌ చేయడం లేదో అర్ధం కావడం లేదన్నారు.

Related posts