బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ ఎప్పుడూ వివాదాస్పద వార్తలతో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. 40 ఏళ్ళ ఈ అమ్మడు ఇండియాస్ గాట్ టాలెంట్ షో కంటెస్టెంట్ దీపక్ కలాల్ను వివాహం చేసుకోబోతున్నట్టు అప్పట్లో ప్రకటించి సంచలనం సృష్టించింది. వీరి వివాహం లాస్ ఏంజెల్స్ లో జరుగుతుందని కూడా పేర్కొంది. ఏమైందో ఏమో తెలియదుగాని, ఆ వివాహం జరగడం లేదని ఆ తరువాత రాఖీ సావంత్ పేర్కొంది. తాజాగా రాఖీ సావంత్ ఓ ఎన్నారైని రహస్యంగా వివాహం చేసుకుందని అనేక పుకార్లు షికారు చేశాయి. ఈ నెల 28న పెళ్ళి పీటలెక్కిన ఈ అమ్మడికి ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఆశీస్సులు అందించినట్టు రాశారు. దీనిపై స్పందించిన రాఖీ సావంత్ తన పెళ్లి వార్తలలో నిజం లేదని పేర్కొంది. ‘‘జేడబ్ల్యూ మారియట్లో నేను పెళ్లి షూట్లో పాల్గొన్నాను. అంత మాత్రం దానికి నాకు పెళ్లైపోయిందని ఎందుకు ప్రచారం చేస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. నేను ఎవరితో రిలేషన్లో లేను. ఇప్పటికి సింగిల్గానే ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది రాఖీ సావంత్.
తాజాగా ఈ హాట్ బాంబ్ తన పెళ్ళి రాఖీ సావంత్ తాజాగా తాను రితేష్ అనే ఎన్నారై బిజినెస్మెన్ని ముంబైలో వివాహం చేసుకున్నట్టు తెలిపింది. జూలై 20న తమ పెళ్లి చాలా సీక్రెట్గా, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిందని చెప్పుకొచ్చింది. సీక్రెట్గా వివాహం రాఖీ స్పందిస్తూ “నా భర్తకి హడావిడి ఎక్కువగా నచ్చదు. మీడియా, ఫోటోలు వంటి వాటిపై పెద్దగా ఆసక్తి చూపడు. ఫ్యామిలీ మధ్యనే వివాహం జరుపుకోవడం తనకి ఇష్టం. అతను హిందూ ఎన్ఆర్ఐ, నేను క్రిస్టియన్. అందుకుగాను మేమిద్దరం చట్ట పరంగా వివాహం చేసుకున్నాము. నా భర్త డొనాల్డ్ ట్రంప్కి చెందిన కంపెనీలో పని చేస్తున్నారు. అతనికి బాలీవుడ్ అంటే ప్రేమ. వాట్సాప్ చాటింగ్తో మొదలైన మా ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. ఆయనకి మంచి తల్లితండ్రులు, సోదరి ఉన్నారు. పెళ్లైనప్పటికి నేను బాలీవుడ్లో సినిమాలు చేస్తాను” అని రాఖీ తెలియజేసింది.
“జబర్దస్త్” నుంచి పంపించేస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు…: హైపర్ ఆది