ఆర్ఆర్ఆర్ తరువాత మరోసారి ఎన్టీఆర్, చెర్రీ కలిసి నటించబోతున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఈ ఇద్దరితో ఓ సినిమాను తెరకెక్కించాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాది అల వైకుంఠపురములో మూవీతో మరో సక్సెస్ను ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్.. నెక్ట్స్ ప్రాజెక్ట్గా ఎన్టీఆర్తో అయినను పోయి రావలె హస్తినకు అనే మూవీని తెరకెక్కించనున్నారు. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్, చెర్రీలతో ఆయన ఓ మల్టీస్టారర్ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్. ఇక ఈ ప్రాజెక్ట్ను రెండు భారీ నిర్మాణ సంస్థలు నిర్మించబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
previous post